అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.
సినిమాకు సంబందించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఆగష్టు 3, 4 తేదీల్లో కృష్ణపట్నం పోర్ట్ లో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది.
సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం అఖిల్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.
సినిమాలో గ్లామర్ విషయంలో బుట్ట బొమ్మ ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది.బ్యాచిలర్ సినిమా మీద అఖిల్ ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.బ్యాచిలర్ మూవీతో పాటుగా ఏజెంట్ సినిమా మీద కూడా పూర్తి ఫోకస్ తో పనిచేస్తున్న అఖిల్ ఈ రెండు సినిమాలతో కెరియర్ సెట్ రైట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఏజెంట్ తర్వాత కూడా స్టార్ డైరక్టర్ తో అఖిల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
ఆ స్టార్ డైరక్టర్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.