అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ప్రధాని మోడీ తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యేలా ఈ భేటీ జరిగింది.
భేటిలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక అంశలపై చర్చలు జరిపారు.ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామానవత్వం తదితర అంశాల విషయంలో రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు.
మరోపక్క ఈ పర్యటన ఉద్దేశించి ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అయిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.కరోనా పర్యావరణ పై పోరాటం అదేరీతిలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పరిస్థితి పై చర్చలు జరిగినట్లు సమాచారం.
అదే రీతిలో కరోనా పై పోరాటం విషయంలో భారత్ కి అమెరికా అండగా ఉంటుందని ఈ పర్యటనలో విదేశాంగ శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది అంట.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు 25 మిలియన్ల డాలర్ల అదనపు సాయాన్ని అమెరికా ప్రకటించటం విశేషం.ముఖ్యంగా కరోనా వచ్చిన ప్రారంభంలో అమెరికాకి భారత్ చేసిన సాయం ఎన్నడూ మర్చిపోలేనిది అని తెలిపారు.