తెలుగులో ప్రస్తుతం యంగ్ హీరో “నితిన్” వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకటి, రెండు చిత్రాలతో బాగానే అలరిస్తున్నాడు.
కాగా ఇటీవలే నితిన్ హీరోగా నటించిన “రంగ్ దే మరియు చెక్” చిత్రాలు విడుదల కాగా రంగ్ దే చిత్రం పర్వాలేదనిపించింది.కానీ “చెక్” చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో నితిన్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ఈ ఏడాది ఆరంభం నుంచి సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడిపిన నితిన్ ప్రస్తుతం కొంతకాలం పాటు షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు.
ఈ క్రమంలో సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉండే నితిన్ అప్పుడప్పుడు పలు ఫోటోలు మరియు వీడియోలు తో ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు.
కాగా తాజాగా సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్న సమయంలో తీసినటువంటి ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.అంతేకాకుండా ఆకాశం, సముద్రం కలిసినట్లు ఉండడం అలాగే వ్యూ చాలా బాగుందని క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 1.50 లక్షల పై చిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.అంతే కాకుండా ఈ ఫోటో పై టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ కూడా స్పందిస్తూ “వాహ్” అంటూ కామెంట్ చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నితిన్ తెలుగులో “మాస్ట్రో” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాక మంచి స్పందన లభించింది.కాగా ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా ఇస్మార్ట్ శంకర్ మూవీ ఫేమ్ “నభా నటేష్” నటిస్తుండగా మిల్కీ బ్యూటీ “తమన్నా” కీలక పాత్రలో నటిస్తోంది.
కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “మేర్లపాక గాంధీ” దర్శకత్వం వహిస్తున్నాడు.