కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా దేశంలో అన్ని రైల్వే స్టేషన్లకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.కరోనా కారణంగా రైల్వే ప్రయాణం అంటే భయపడే పరిస్థితి నెలకొన్న తరుణంలో.
మళ్లీ ప్రయాణికులను ఆకర్షించే రీతిలో.రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.
ఈ క్రమంలో దేశంలో సరైన సదుపాయాలు లేని రైల్వేస్టేషన్లు మినహా… మిగతా రైల్వే స్టేషన్లకు ఫ్రీ వైఫై అందిస్తున్నట్లు.తాజాగా భారతీయ రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది.
ఈ రీతిగా భారతీయ రైల్వే సంస్థని పునరుద్ధరించే లా.ప్రయాణికులను ఆకర్షించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సరికొత్త ఆలోచన చేపట్టారు.ఇప్పటికే ఫ్రీ వైఫై సదుపాయం దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
ఇటువంటి తరుణంలో దేశ వ్యాప్తంగా సదుపాయాలు కలిగి ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో .ఫ్రీ ఇంటర్నెట్ ప్రకటించడం పట్ల.దేశ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.