1.గేదె మాంసంలో కరోనా మూలాలు
భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు ఉన్నట్టు కాంబోడియా ఆరోగ్య మంత్రి ప్రకటించారు.ఈ నేపథ్యంలో దిగుమతులను కాంబోడియా తాత్కాలికంగా నిలిపివేసింది.
2.పాలిసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ పాలిసెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి.రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కన్వీనర్ శ్రీనాథ్ బుధవారం విడుదల చేశారు.
3.ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ మృతి
ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కాంబ్లే మృతి చెందారు.గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.
4.ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అరెస్ట్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని మునుగోడు నియోజకవర్గానికి వర్తింప చేయాలని రాజగోపాల్ రెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు.
5.ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపు పై విచారణ వాయిదా
ఏపీ పరిషత్ ఓట్ల లెక్కింపు పై విచారణను ఆగస్ట్ 4 కి హైకోర్ట్ వాయిదా వేసింది.
6.ఏపీ డిప్యూటీ సీఎం కు కరోనా
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
7.యడియూరప్ప సేవలు మరువలేనివి
కర్ణాటక మాజీ సీఎం యడియురప్ప సేవలు మరువలేనివి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.
8.జేడీ పిటిషన్ పై కేంద్రం స్పందన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయంలో జేడి లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్ పై కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.జేడీ పిటిషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే వేసిందని కేంద్రం పిటిషన్ లో పేర్కొంది.
9.జగన్ పై వీర్రాజు కామెంట్స్
ఏపీ సీఎం జగన్ పై ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఆంగ్లేయులు ది ఏపీ సీఎం జగన్ ది ఒకటే మనస్తత్వం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.
10.అమిత్ షాతో తెలంగాణ ఎంపీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఎంపీ సోయం బాబురావు భేటీ అయ్యారు.భైంసా అల్లర్లకు సంబంధించిన అల్లర్ల విషయమై చర్చించినట్టు సమాచారం.
11.ఐ ప్యాక్ టీమ్ పై కేసు నమోదు
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ సభ్యుల పై పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసు చేశారు.మొత్తం 23 మంది సభ్యులపై కేసు నమోదు అయ్యింది.
12.రేపటి నుంచి వైద్య కళాశాలల్లో తరగతులు
ఈ నెల 29 నుంచి వైద్య, దంతవైద్య , పారా మెడికల్ కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
13.నేటి నుంచి పోలీసు పరీక్షలకు ఉచిత శిక్షణ
నేటి నుంచి పోలీసు పరీక్షల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూట్యూబ్ ద్వారా ఉచిత ఆన్ లైన్ తరగతులు నిర్వహించనున్నారు.
14.రామప్పకు యునెస్కో బృందం
రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడం గా గుర్తింపు ఇచ్చిన యునెస్కో .వచ్చే అక్టోబర్ లో ఈ ఆలయాన్ని సందర్శించనుంది.
15.మైలవరం లో టీడీపీ నేతల ఆందోళన
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుకు నిరసనగా మైలవరంలో ఉమ అనుచరులు నిరసనకు దిగారు.
16.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 16,465 మంది భక్తులు దర్శించుకున్నారు.
17.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 43,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.బెయిల్ బ్యాచ్ అంటూ రఘురామ విమర్శలు
దొంగలంతా కలిసి నాపై అసత్య ఆరోపణలతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేస్తారా అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు.
19.కర్ణాటక కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
కర్ణాటక 23 వ సీఎంగా బసవరాజ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 44,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,880