ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ నటి త్రిష.హీరోయిన్ త్రిషకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.అభిమానులు ” సౌత్ క్వీన్ ” గా పిలుస్తారు.వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమైనప్పటికీ ఇటీవలే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈభామ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిలైయిపోయింది.
లేడీ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటోంది.ఇదిలా ఉండగా త్రిష మరోసారి ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో వరుణ్ మణియయన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన ఆమె అతడితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లి వరకు వెళ్లిన ఈ జంట నిశ్చితార్థం తర్వాత వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లిని రద్దు చేసుకున్నారు.
ఇక అప్పటి నుంచి సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఇటీవలే ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం నడుపుతున్నాట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినికిడి.తాజాగా విషయంపై క్లారిటీ ఇచ్చేసింది త్రిష.
కొన్ని వారాలుగా చెన్నై చేందిన వ్యాపారవేత్తతో ఏడు అడుగులు వేస్తున్న త్రిష అంటూ వార్త సోషల్ మీడియాలో వస్తున్న వాటిని ఆమె ఖండిస్తూ.అవన్నీ రూమర్స్ అని ఆమె కొట్టిపారేసింది.
పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలు అబద్ధం అని వెల్లడించారు.అంతకుముందు త్రిష పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటి చార్మి త్రిష పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ చేసింది.బ్రహ్మచారిగా త్రిషకు చివర పుట్టినరోజు అవుతుందని ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది.ఛార్మి ట్వీట్ కు త్రిష స్పందించలేదు.ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో ” పొన్నియన్ షెర్లిన్ “చిత్రం లో కీలకమైన పాత్రలో నటిస్తుది.