టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.
ఎందుకంటే ఇంతకు ముందు వీరి కాంబోలో సింహ, లెజెండ్ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు కూడా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో పని చేస్తున్నారు.
అఖండ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించ బోతున్నాడు.
అంతేకాదు ఇందులో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.
అందులో ఒకటి అఘోర పాత్ర అని తెలుస్తుంది.మొన్నటి వరకు కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతుంది.మాస్ క్లైమాక్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఒక కీలక పాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఆయన చేయబోతున్న పాత్ర గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.లేటెస్ట్ బజ్ ప్రకారం.ఇందులో జగపతి బాబు కూడా బాలయ్య లాగా అఘోర పాత్రలోనే కనిపించే బోతున్నాడని ఆ వార్తలు సారాంశం.జగపతి బాబు పాత్ర ఈ సినిమాకే కీలకం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈ సినిమాలో అందరి రోల్స్ కూడా కొత్తగా ఉండబోతున్నాయనేది మాత్రం అర్ధం అవుతుంది.
తాజా వార్తలు