మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబో లో రాబోతున్న సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.మొదటగా సినిమాకు సంబంధించిన భారీ పాట చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు.
ఆ పాట కోసం భారీ ఎత్తున సెట్టింగ్ ను వేయిస్తున్నారు.శంకర్ ప్రతి సినిమాలో కూడా ఒక పాటను భారీ రేంజ్ లో చిత్రీకరిస్తాడు.
ఈ సినిమాలో కూడా ఒక పాటకు ఏకంగా 5 నుండి 6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాడు.సెట్టింగ్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారట.
అంతటి భారీ పాట అంటే ఎంతటి మాస్ బీట్స్ ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకే దర్శకుడు శంకర్ అభిరుచికి తగ్గట్లుగా థమన్ భారీ ఎత్తున పాటను రికార్డ్ చేయిస్తున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ సినిమాలోని మొదటి పాట కోసం థమన్ ఏకంగా 140 మంది మ్యూజీషియన్స్ తో రికార్డ్ చేయబోతున్నాడు.థమన్ గతంలో ఎన్నో ఇలాంటి ప్రయోగాలు చేశాడు.ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఆయన ఈ ప్రయోగంను చేస్తున్నాడు.అద్బుతమైన థమన్ అందించబోతున్న ఆ పాటకు చరణ్ తో జానీ మాస్టర్ స్టెప్పులు వేయించబోతున్నాడు.మొత్తంగా ఆ పాట కన్నుల వింధుగా తెలుగు సినిమా చరిత్రలో అలాంటి పాట రాలేదు అన్నట్లుగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పాట చిత్రీకరణ కు రెండు నెలల సమయం ఉండగానే ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఏ రేంజ్ లో సినిమా లో ఆ పాట ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.