ఆమె కుమారుడు తెలివైనవాడు ఎక్కువ మార్కులు సాధించే వాడు.మరి ఈసారి ఎందుకో వెనుక పడ్డాడు.
మార్కులు తక్కువ వచ్చాయి ఆ తల్లి మనసు తల్లడిల్లింది.పాఠశాల ముందు బైఠాయించింది.
వివరాల్లోకి వెళితే.భువనేశ్వర్ లో విద్యార్థికి పదోతరగతి బెటర్మెంట్ పరీక్షలు రాసేందుకు అడ్మిట్ కార్డు రాకపోవడంతో ఆ తల్లి పాఠశాల ముందు ఆందోళన చేపట్టి ఆత్మహత్యాయత్నం చేసింది.
స్కూల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటన మంగళవారం భువనేశ్వర్ లోని క్యాపిటల్ హై స్కూల్ వద్ద చోటుచేసుకుంది.
పోలీసు విచారణలో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ అందించిన వివరాల ప్రకారం.నా కుమారుడు తెలివైనవాడు ఎక్కువ మార్కులు సాధించే వాడు ఇటీవల వెల్లడైన పదవ తరగతి ఫలితాల్లో నా కుమారుడికి 250 మార్కులు మాత్రమే వచ్చాయి దీంతో బెటర్మెంట్ పరీక్షలు రాసేందుకు విద్యా పరిషత్ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు ఇతర విద్యార్థులకు అడ్మిట్ కార్డు వచ్చిన నా కుమారుడికి రాలేదు దీంతో ఆత్మ ప్రయత్నం చేశానని వెల్లడించింది.
నా కుమారుడు మళ్ళీ పరీక్షలు రాయడానికి అవకాశం కల్పించాలని వేడుకుంది.ఆ తల్లి మనసు అర్థం చేసుకోని అధికారులు ఆ విద్యార్థికి పరీక్షలకు అనుమతి ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.