సమాజంలో రోజు రోజుకి ఏదో ఒక రూపంలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.డబ్బు పై ఉన్న వ్యామోహంతో ఎంతటి ఘన కార్యానికైనా వెనకడుగు వేయటం.
వివరాల్లోకి వెళితే ఓ మహిళకు మాయమాటలు చెప్పి 25 లక్షల టోకరా పెట్టాడు.మీ గ్రహ స్థితి బాగోలేదు పూజలతో బాగు చేస్తాను అంటూ మాయమాటలతో మహిళలు నమ్మించి 25 లక్షలకు టోకరా పెట్టి ఓ పూజారి అనంతరం పరారయ్యాడు.
నిజామాబాద్ డిచ్పల్లి మండలం లోని ధర్మవరం గ్రామంలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొంతకాలంగా శ్రీనివాస్ శర్మ పూజారి గా పని చేస్తున్నాడు.నిజామాబాద్ కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చెందిన మాధవిలత ఖిల్లా రోడ్ లో పాన్షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది.
ఆమె భర్త గణేష్ కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు.మనవరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
మాధవి లత ధర్మవరంలో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ పూజారికి తన సమస్యను చెప్పుకుంది.మీ గ్రహస్థితి బాగా లేదని అందుకే మీ కుటుంబంలో ఎవరికి బాగోలేదని నేను చెప్పినట్టుగా పూజలు చేస్తే మీ సమస్యలు తీరుతాయని నమ్మించాడు.
పూజారి మాయ మాటలు నమ్మిన మాధవీలత శ్రీనగర్ లో తనకున్న రెండెకరాల భూమి అమ్మగా వచ్చిన 25 లక్షలు దశల వారీగా పూజారికి ఇచ్చింది.అతను మాయ మాటలను తెలుసుకుని మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో పూజలు శ్రీనివాస్ శర్మ మే 29 నుంచి అర్ధాంతరంగా కనిపించకుండా పోయాడు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.