బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ క్రమంలోనే స్టార్ మా సెలబ్రిటీలకు ఓ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.
ఇకపోతే స్టార్ మా సీరియల్ సెలబ్రిటీల అందరూ కలిసి గత ఆదివారం “స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్” కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్స్ నటీనటులందరూ ఒకే వేదికపై చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో పంచులు వేస్తూ ఎంతో సరదాగా సాగిపోయింది.
స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ కార్యక్రమానికి కేవలం సీరియల్ ఆర్టిస్ట్ లు మాత్రమే కాకుండా, కామెడీ స్టార్స్, బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ లు కూడా పాల్గొన్నారు.
అలాగే మద్య మద్యలో సింగర్స్ వచ్చి పాటలు పాడుతూ ప్రేక్షకులను సందడి చేశారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు ఒక తండ్రి కోసం తన పిల్లలు పడే ఆరాటం ఏ విధంగా ఉంటుందో ఒక ఎమోషనల్ సాంగ్స్ ద్వారా చెప్పడంతో స్టేజ్ పై ఉన్న పలువురు ఎంతో భావోద్వేగం అయ్యారు.
ఈ క్రమంలోనే కార్తీక్ చేస్తున్న డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి కార్తీక దీపం భాగ్యం ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా మనసిచ్చి చూడు సీరియల్ హీరోయిన్ కీర్తి కూడా ఎమోషనల్ అవడం గమనించిన శ్రీముఖి కార్తీకదీపం భాగ్యాన్ని, అదేవిధంగా మనసిచ్చి చూడు కీర్తిని ఎందుకలా అంటూ ప్రశ్నించింది.
ఈ క్రమంలోనే కీర్తి మాట్లాడుతూ.తనకి కూడా తన అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఎవరూ లేరని.తన కుటుంబం అంతా నాలుగు సంవత్సరాల క్రితం కారు యాక్సిడెంట్ లో చనిపోయారని బావోద్వేగమయ్యారు.మొదట్లో చాలా బాధపడ్డాను.ఇప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నానని.అందుకు కారణం మనసిచ్చి చూడు సీరియల్ లో తన తండ్రి పాత్రలో చేస్తున్న చంద్రశేఖర్ నాన్న తన సొంత కూతురుగా చూసుకుంటున్నారని ఈ సందర్భంగా నటి కీర్తి తెలియజేశారు.