హర్యానాలోని పల్వాల్ నుంచి బీహార్ వైపు గా వెళ్తున్నా బస్సు ప్రమాదానికి గురైంది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరాబంకిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.
కూలీలు కలిగిన ఈ వోల్వో బస్సు వెనుక నుండి ట్రక్కు వచ్చి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.ఇదే సమయంలో చాలా మంది గాయాలపాలయ్యారు.
సరిగ్గా ఈ ఘటన బారబంకి ప్రాంతం దగ్గర రామ్ సనే ఘాట్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది.
దాదాపు 100 మంది ప్రయాణికులు కలిగిన ఈ బస్సులో 18 మంది మృతి చెందడం ఇంకా చాలా మందికి గాయాలు కావడంతో ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం వద్ద ఆర్తనాదాలు చావు కేకలతో నిండిపోయింది.
దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రమాదం జరిగిన చోటికి వచ్చి క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించడానికి సహాయపడ్డారు.అంత మాత్రమే కాక సంఘటనా స్థలం వద్దకు బరాబంకి పోలీసులు రావడం జరిగింది ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకుని విచారణ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో ఎస్పీ యమునా ప్రసాద్సం ఘటనా స్థలం వద్ద మాట్లాడుతూ ఆగివున్న బస్సును ట్రక్కు బలంగా ఢీకొనడంతో నే ప్రమాదం సంభవించిందని తెలియజేశారు.