ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

హర్యానాలోని పల్వాల్ నుంచి బీహార్ వైపు గా వెళ్తున్నా బస్సు ప్రమాదానికి గురైంది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బరాబంకిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది.

 Terrible Road Accident In Uttar Pradesh Bus Accident, Police, Uttar Pradesh,ter-TeluguStop.com

కూలీలు కలిగిన ఈ వోల్వో బస్సు వెనుక నుండి ట్రక్కు వచ్చి ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు.ఇదే సమయంలో చాలా మంది గాయాలపాలయ్యారు.

సరిగ్గా ఈ ఘటన బారబంకి ప్రాంతం దగ్గర రామ్ సనే ఘాట్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది.

దాదాపు 100 మంది ప్రయాణికులు కలిగిన ఈ బస్సులో 18 మంది మృతి చెందడం ఇంకా చాలా మందికి గాయాలు కావడంతో ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం వద్ద ఆర్తనాదాలు చావు కేకలతో నిండిపోయింది.

దీంతో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రమాదం జరిగిన చోటికి వచ్చి క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ కి తరలించడానికి సహాయపడ్డారు.అంత మాత్రమే కాక సంఘటనా స్థలం వద్దకు బరాబంకి పోలీసులు రావడం జరిగింది ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకుని విచారణ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో ఎస్పీ యమునా ప్రసాద్సం ఘటనా స్థలం వద్ద మాట్లాడుతూ ఆగివున్న బస్సును ట్రక్కు బలంగా ఢీకొనడంతో నే ప్రమాదం సంభవించిందని తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube