కర్ణాటక సీఎం గా యడియూరప్ప రాజీనామా చేసినా విషయం తెలిసిందే.నెక్స్ట్ కర్ణాటక సీఎం గా ఎవరు ఎన్నుకుంటారా అనుకుంటున్న టైం లో బీజేపీ అధిష్టానం కొత్త సీఎం పేరుని ప్రకటించింది.
బీజేపీ కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని నియమించింది.యడియూరప్ప కేబినెట్ లో హోం మంత్రిగా ఉన్నారు.
యడియూరప్ప రాజీనామా చేయడంతో ఏకంగా సీఎం పీఠాన్ని దక్కించుకున్నాడు.లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై నాయకత్వ లక్షణాల మీద బీజేపీ హైకమాండ్ పూర్తి విశ్వాసం ఉచింది.
బెంగళూరు విచ్చేసిన బీజేపీ కేంద్ర పరిశీలీకుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కర్ణాటక నూతన సీఎం గా బసవరాజు బొమ్మై పేరుని ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రదాన్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి కర్ణాటక బీజేపీ ఎమంల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి కొత్త సీఎం ఎంపిక చేశారు.
కొత్త సీఎం రేసులో పలువురి పేర్లు వినిపించినప్పటికీ బీజేపీ పెద్దలు బొమ్మై కే ఓటు చేశారు.బొమ్మై సీఎం గా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.బసవరాజు బొమ్మై తండ్రి ఎసార్ బొమ్మై కూడా గతంలో కర్ణాటక సీఎం గా చేశారు.