ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ K.వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ ఈ మూవీని 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపిక పదుకొనె హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.బిగ్ బీ అమితాబ్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు.
ఇక లేటెస్ట్ గా ఈ మూవీలో సమంత కూడా నటిస్తుందని అంటున్నారు.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందట.
ఆ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ను పెట్టాలని చూస్తున్నారు.నాగ్ అశ్విన్ ఆ రోల్ కోసం సమంతని అడగాలని చూస్తున్నారట.
పెళ్లి తర్వాత వెరైటీ సినిమాలు చేస్తున్న సమంత ప్రాజెక్ట్ కెకి ఓకే చెప్పినా చెప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు.సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తుంది.మైథలాజికల్ మూవీగా వస్తున్న శాకుంతలం సినిమాలో సమంత నటన అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.
ఆ సినిమాతో పాటుగా ప్రాజెక్ట్ కె లో కూడా సమంత చేస్తే మాత్రం ఇక అమ్మడికి తిరిగు ఉండదని చెప్పొచ్చు.