పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.నిన్నటి నుండి షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది.
సినిమాటోగ్రాఫర్ వివాదం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాన్ భీమ్లా నాయక్ గా ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు.
అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్ లో పవన్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ను స్పీడ్ గా పూర్తి చేసి సాధ్యం అయినంత త్వరగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడంటూ ఒక ఫొటోను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు నేడు మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్.రానాలు కలిసి నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నారు.నేడు సాయంత్రం సమయంలో మేకింగ్ వీడియోను విడుదల చేయబోతున్నట్లుగా చేసిన ప్రకటనతో ఒక్కసారిగా సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెలతో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
రానా తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.పెద్ద ఎత్తున ఈ సినిమాను సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
త్రివిక్రమ్ ఈ సినిమాకు రచయితగా వ్యవహరిస్తున్నారు.సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో నిర్మాణం జరుగుతున్న ఈ సినిమా ను ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
పవన్ కు జోడీగా ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్ విషయమై నేడు విడుదల కాబోతున్న మేకింగ్ వీడియోతో క్లారిటీ వస్తుందా చూడాలి.ఒరిజినల్ వర్షన్ కు కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్ర ఎక్కువ ఉండేలా ప్లాన్ చేశారట.