చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ ను సాగతీస్తున్నారనే వాదన వినిపిస్తుంది.ఏప్రిల్ లో సినిమా షూటింగ్ ను ముగించి మే రెండవ వారంలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
కాని కరోనా సెండ్ వేవ్ వల్ల ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది.కనీసం షూటింగ్ ను కూడా పూర్తి చేయలేక పోయారు.
సెకండ్ వేవ్ తర్వాత వారం పది రోజుల్లో షూటింగ్ ను ముగించి దసరాకు సినిమాను విడుదల చేస్తారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జరిగింది.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
రెండు వారాల క్రితం పునః ప్రారంభం అయిన ఆచార్య సినిమా షూటింగ్ ను వచ్చే నెల వరకు కొనసాగిస్తారనే వార్తలు వస్తున్నాయి.హైదరాబాద్ షెడ్యూల్ తో ముగిస్తారని అంతా అనుకుంటూ ఉండగా తాజాగా కాకినాడ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కాకినాడకు సంబంధించిన షెడ్యూల్ రీ షూట్ కోసం అంటున్నారు.అంటే గతంలో చేసిన కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల అనూహ్యంగా రీ షూట్ కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.చిరంజీవి పై కాకినాడ పోర్ట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలసిందే.ఆయన పై షూటింగ్ ఇప్పటికే ముగించారని ప్రకటన వచ్చింది.షూటింగ్ లో ఆయన పాల్గొన్నది కొన్ని రోజులే అయినా షూటింగ్ ను ముగించారు.
కాని చిరంజీవి సన్నివేశాలు కొన్ని రీ షూట్ చేయాల్సి వచ్చింది కనుక వచ్చే నెల రెండవ వారం వరకు ఆచార్య సెట్స్ పైనే ఉంటాడని వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నాయి.
ఆ తర్వాత కాకినాడ పోర్ట్ కు వెళ్లబోతున్నారు.