కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సరికొత్త రీతిలో జాతీయస్థాయిలో గతానికి భిన్నంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో పెగసస్అదే రీతిలో కొత్త రైతుల చట్టాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ సరికొత్తగా వ్యవహరిస్తూ వచ్చారు.
ఇప్పుడు తాజాగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం అయ్యేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా ఏపీ పై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇటీవల రాహుల్ గాంధీ తో ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి ఉమెన్ చాంది భేటీ కావడం జరిగింది.ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో ఏపీ పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలకు జాతీయస్థాయిలో పదవులు కట్టబెట్టడానికి రాహుల్ గాంధీ రెడీ అయినట్లు సమాచారం.ఇదే క్రమంలో పిసిసి కార్యవర్గం లో మార్పులు చేర్పులు పై కూడా ఇన్చార్జి తో రాహుల్ గాంధీ చర్చించడం జరిగింది.
ఏదిఏమైనా ఏపీకి ఎలక నేతలకు కొత్త బాధ్యతలు అప్పజెప్పి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఆలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.