పిల్లలు చాలా సున్నితం.వారిని కంటికి రెప్పలా కాపాడు కోవాలి.
లేకపోతే వాళ్ళు డేంజర్ లో పడే అవకాశం ఉంది.ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అదే.మూడు సంవత్సరాల చిన్నారి 5 సెంటీ మీటర్ల వినాయకుడి విగ్రహాన్ని మింగేశాడు.ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు బయపడి పోయారు.
మనం ఇప్పటి వరకు చాలా మంది పిల్లలు అది మింగారు.ఇది మింగారు.
అని వింటూనే ఉంటాం.
కానీ అంత విగ్రహాన్ని ఎలా మింగాడా అని అందరు ఆశ్చర్య పోతున్నారు.
చిన్న పిల్లాడు కడుపు నొప్పి అని బాధ పడుతుంటే హాస్పిటల్ కు తీసుకు వెళ్లగా అసలు విషయం బయట పడింది.బాలుడి పొట్టలో వినాయకుడి విగ్రహం ఉందని వైద్యులు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపారు.
దీంతో వారు ఆశ్చర్య పోయారు.వెంటనే సర్జరీ చేయాలనీ డాక్టర్లు తల్లిదండ్రులకు తెలిపారు.
ఈ సంఘటన బెంగలూరు లో జరిగింది.ఆ పిల్లాడు ఆ చిన్న వినాయకుడి విగ్రహంతో ఆడుకుంటూ తెలియక నోట్లో పెట్టుకున్నాడు.తర్వాత ఆ విగ్రహాన్ని మింగాడు.కొద్దీ సేపటికి తల్లిదండ్రులు కొడుకుకి ఊపిరి అందక పోవడంతో ఎం జరిగిందో తెలియక హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు.దీంతో డాక్టర్లు ఎక్సరే తీయగా విగ్రహం కడుపులో ఉన్న విషయాన్ని గుర్తించారు.
వెంటనే ఆ విగ్రహాన్ని తీయాలని చెప్పడంతో తల్లిదండ్రులు ఓకే చెప్పారు.మూడు గంటలు శ్రమించి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు.మూడు గంటల్లోనే ఆ బాలుడు ఆక్టివ్ అయ్యి భోజనం చేయడంతో సాయంత్రానికి డిశ్చార్జ్ చేసారు.
ఈ నేపథ్యంలో డాక్టర్స్ మాట్లాడుతూ.పిల్లలను ఆడుకుంటుంటే అలా వదిలేయకుండా ఒక కంట కనిపెడుతూ ఉండాలని వారు చెబుతున్నారు.
ఈ బాలుడ్ని తల్లిదండ్రులు వెంటనే స్పందించి తీసుకురావడంతో కాపాడగలిగామని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు.