నర్సాపురం పార్లమెంటు సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని మోడీ కి ఫిర్యాదు చేశారు.విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15 మంది ఎంపీల బృందం ప్రధానికి ఫిర్యాదు చేశారు.
రఘురామకృష్ణంరాజు, బిఆర్ నాయుడు మధ్యాహ్న వాళ్ల లావాదేవీలు జరిగాయని వారిద్దరిమధ్య మిలియన్ యూరోలు బదిలీ అయ్యాయని ఎంపీలు ఆరోపించారు.మనీలాండరింగ్ చట్టాల కింద విచారణ చేపట్టాలని ప్రధాని మోడీ కి విజ్ఞప్తి చేశారు.
ఎంపీ రఘురామ కృష్ణరాజు బి ఆర్ నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీలువిచారణ గురించి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.నిందితులైన కే రఘురామకృష్ణరాజు, బి ఆర్ నాయుడు విదేశాలకు పారిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని కస్టడీలోకి తీసుకొని అనుమానస్పద లావాదేవీలు ను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిశారు.పోలవరం ప్రాజెక్ట్ గురించి చర్చించారు.పోలవరం ప్రాజెక్టుకు 2017 -18 ధరల ప్రకారం భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ని కలిపి 55,656,86 కోట్లకు సిడబ్ల్యూసీ,.టిఎసిలు ఆమోదం తెలిపాయని గుర్తు చేశారు.
పోలవరం, ప్రత్యేక హోదా పై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. పోలవరం తుది డిపిఆర్ కు ఆమోదం తెలపాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.