రైలు ప్రయాణికులకు ఒక తీపి కబురు అందించింది భారత రైల్వే శాఖ.తాజాగా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు.
అసలు ఇంతకి ఆ శుభవార్త ఏంటి అనుకుంటున్నారా.? సాధారణంగా రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి.జనంతో కిటకిటలాడుతూ ఎప్పుడు చుసిన రద్దీగానే ఉంటుంది.ఒక పక్క ప్యాసింజర్స్ మరోపక్క వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చే జనంతో చాలా గందర గోళంగా ఉంటుంది.
కావున ఈ రద్దీని తగ్గించే క్రమంలో రైల్వేశాఖ కొన్ని రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుంది.అదేంటంటే మనం అందరం కరోనా కష్టకాలంలో ఉన్నాము కావున రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్లాట్ ఫాం టికెట్ ధరలను ఏకంగా 50 రూపాయలు చేసిన విషయం మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ లోని అన్ని రైల్వేస్టేషన్ లలో ఉన్న ప్లాట్ఫారం టికెట్ ధరలను తగ్గిస్తూన్నామని రైల్వే శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ క్రమంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ లలో ప్లాట్ఫారం టికెట్ ధరను 10 రూపాయలుగా తగ్గించారు.అలాగే ప్రధాన స్టేషన్లు అయిన సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ లలో మాత్రం ప్లాట్ఫారం ధర 20 రూపాయలు చేశామని రైల్వే అధికారులు వెల్లడించారు.
రైల్వే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రయాణికుల మీద పడిన భారం మరింత తగ్గిందనే చెప్పాలి.ఈ క్రమంలో రైల్వేశాఖ ప్రయాణికులకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది.అవి ఏంటంటే ఇంకా కరోనా వైరస్ మనల్ని వదిలి పూర్తిగా వెళ్ళలేదు కావున రైలు ప్రయాణికులు అందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్క్ ధరించి ప్రయాణం చేయాలనీ కోరాయి.
అలాగే శానిటైజర్స్ కూడా ప్రయాణికులు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు.ప్రతి ప్రయాణికుడు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ రైల్వే అధికారులకు సహకరించాలని తెలిపారు.