రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ డైరక్షన్ లో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సౌత్ అన్ని భాషల్లోరిలీజైంది.అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.గీతా గోవిందం తో హిట్ అందుకున్న విజయ్, రష్మిక కలిసి చేసిన డియర్ కామ్రేడ్రి లీజ్ కు ముందు ఓ రేంజ్ లో హడావిడి చేయగా రిలీజ్ తర్వాత అంచనాలను అందుకోలేదు.
ఇక నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ మేము చేయాల్సింది చేశామని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.సినిమా మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను అలరించింది.
అంచనాలు ఎక్కువ ఉండటం.దానికి తగినట్టుగా సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది.
ఈ సినిమాలో రష్మిక మందన్న నటనతో అందరిని ఆకట్టుకుంది.సినిమా రిలీజై రెండేళ్లు అవుతున్న సందర్భంగా విజయ్ చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్రయూనిట్.