వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.రాజ్యసభ, లోక్ సభ లో కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు చట్టాలు అదే రీతిలో పెగాసస్ స్పైవేర్ అంశంపై విపక్షాలు ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి.
ఈ అంశాలపై గత వారం ఐదు రోజుల నుండి విపక్షాలు తీవ్ర ఆందోళనలు నిరసనలు చేపడుతూ ఉండటంతో సభలో ఎటువంటి చర్చలు సజావుగా సాగలేదు.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటులోకి ట్రాక్టర్ తో ఎంట్రీ ఇచ్చారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను మోసం చేసే రీతిగా వ్యవహరిస్తుందని, రైతుల గొంతు నొక్కేసిన రీతిలో చట్టాలు ఉన్నాయి.అంత మాత్రమే కాక రైతుల సమస్యలపై సభలో చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు.కొత్త వ్యవసాయ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేవలం దేశంలో ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారవేత్తలు కోసం.బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.