వర్షా కాలంలో వానలు ఎక్కువగా కురిస్తే ప్రయాణాలకు తప్పకుండ ఆటంకం ఏర్పడుతుంది.వాతావరణం అనుకూలించక విమానాలు ముందుకు కదల లేవు.
రోడ్డు మీద వర్షపు నీరు ఉండడం వల్ల వాహనాలకు కూడా ఇబ్బంది వాటిల్లు తుంది.వీటికి మాత్రమే కాదు వర్షాలు కారణంగా రైలు ప్రయాణాలకు కూడా ఒక్కోసారి ఆటంకం రావొచ్చు.
ఎందుకంటే పట్టాలు తప్పిస్తే రైలు నడపడం సాధ్యం కాదు.
వర్షాలు కారణంగా ఏ క్షణమైనా కొండా చరియలు విరిగి పడడం ఖాయం.
వర్షాలు కూడా ఎక్కువగా ఉంటే వాటి వల్ల వరదలు వచ్చి నానా బీభత్సం చేస్తూ ఉంటాయి.ఈ వరదలు వల్ల చాలా మంది ఉన్న ఇంటిని కూడా కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
తాజాగా కర్ణాటకలో జోరుగా కురిసిన వర్షాలు కారణంగా ఎక్కడబడితే అక్కడ కొండ చరియలు విరిగి పడి ఆటంకాలు కలిగిస్తున్నాయి.తాజాగా బెంగుళూరు నుండి మహారాష్ట్ర వెళుతున్న రైలు దారి మధ్యలో చిక్కుకు పోయింది.
గోవాలో బాగా వర్షాలు పడడం వల్ల కొండా మీద నుండి భారీగా రాళ్ళూ, మట్టి రైలు పట్టాలు మీద పడడంతో రైలు ఆ మట్టిలో కూరుకు పోయింది.
అంత వర్షం పడడంతో ముందుగానే ప్రయాణికులు కూడా అలెర్ట్ గా ఉన్నారు.రైలు కు ప్రమాదం ఏదైనా జరుగుతుందా అని భయంగా కూడా ఉన్నారు.సరిగ్గా అదే సమయంలో రైలుకు ప్రమాదం జరిగింది.ఈ ట్రైన్ వేరే రూట్ లో వెళ్లాల్సి ఉండగా వర్షం కారణంగా నదులు పొందుతుండడంతో రూట్ మల్లించారు.ఆ రూట్ లో వెళ్తున్న సమయంలో ముందుగా ఇంజిన్, మొదటి కోచ్ పట్టాలు తప్పాయి.
రైలు రెండు భోగీలు అక్కడ మట్టిలో కూరుకుపోయాయి.ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగక పోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.కొద్దీ సమయం తర్వాత అంత సెట్ చేసుకుని మళ్ళీ రైలును కదిపారు.