సాధారణంగా చెట్ల వల్ల మానవుడికి కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు.అవి మానవుడికి కావాల్సిన ఆక్సిజన్ అందించడంతో పాటు ఫలాలు, ఇతర ప్రయోజనాలను చేకూర్చుతుంది.
ఈ క్రమంలోనే మొక్కలను పెంచేందుకు ప్రభుత్వాలు, పర్యావరణవేత్తలు పలు కార్యక్రమాలు రూపొందిస్తుంటారు. ట్రీస్ మస్ట్గా ఉండాలనే వాదనలు చేస్తుండటం మనం చూడొచ్చు.
కాగా, మనం ఈ రోజు ఓ డిఫరెంట్ ట్రీ గురించి తెలుసుకుందాం.ఈ ట్రీ నుంచి బ్లడ్ కారుతుందట.
అదెక్కడుందంటే.
హిందూమహాసముద్రంలోని దీవిలో ఉండే ఈ చెట్టు పేరు సొకట్ర.ఈ చెట్టును నరికినపుడు దాని నుంచి ఎర్రటి ద్రవం బయటకు వస్తుంటుంది.సాధారణంగా మానవుడికి ఏదైనా దెబ్బ తగిలిని క్రమంలో ఎర్రటి రక్తం ఎలా బయటకు వస్తుందో అదే మాదిరి చెట్టు నుంచి రెడ్ ద్రవం బయటకు వస్తుంది.
అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ కలిగిన ఈ చెట్టు నుంచి వచ్చిన ఎర్రటి ద్రవాన్ని మెడిసిన్ల తయారీలో వినియోగిస్తున్నారు.ఈ చెట్లను డ్రాగన్ బ్లడ్ ట్రీస్ అని అంటారు.
ఈ చెట్లలో నుంచి వచ్చే ద్రావణం అచ్చం రక్తంలానే ఉండటం విశేషం.ఈ చెట్ల జీవిత కాలం ఆరొందల యాభై ఏళ్లు.
చెట్లను పలు ఔషధాల తయారీలో వాడుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.చెట్ల నుంచి వచ్చే ఎర్రటి ద్రవపదార్థాన్ని మందుల తయారీలో మాత్రమే కాకుండా జిగరు, పెయింటింగ్ కలర్స్, ఫర్నిచర్, టూత్ పేస్ట్ తయారీలోనూ వాడుతుంటారు.
ఇక ఈ చెట్ల భలే గమ్మత్తుగా ఉంటుంది.తిరగేసిన గొడుగు ఆకారంలో ఉండే డ్రాగన్ బ్లడ్ ట్రీ 39 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది.
దీని నుంచి వచ్చే పండ్లు నారింజ రంగులో ఉంటాయి.వీటి సైజ్ ద్రాక్షంతా అండగా, వీటిని పక్షులు అత్యంత ఇష్టంగా భుజిస్తాయట.
కాగా, పక్షుల విసర్జితాల ద్వారానే మళ్లీ చెట్లు పెరుగుతాయి.పురాణ కథనాల ప్రకారం.
మన పూర్వీకులు ఈ చెట్లను పలు రకాలుగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ డిఫరెంట్ ట్రీ మెడిసినల్ వాల్యూస్పై పరిశోధకులు రీసెర్చ్ చేస్తున్నట్లు సమాచారం.