తమిళ సినీ నటి ఐశ్వర్య రాజేష్.టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అతని భార్యగా సువర్ణ పాత్రలో మెప్పించింది.
ఈ సినిమా సక్సెస్ ను అందుకోకపోగా తన పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదిలా ఉంటే తను రెమ్యునరేషన్ గురించి ఓ షాకింగ్ కామెంట్ చేసింది.
కెరీర్ మొదట్లో యాంకరింగ్ గా అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మొదట తమిళ సినిమాలతో ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఇక 2019లో మిస్ మ్యాచ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
హిందీ, మలయాళం సినిమాలలో కూడా నటించింది ఐశ్వర్య.తమిళంలో స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి సక్సెస్ అందుకుంది.
అంతవరకు మామూలు గుర్తింపుతో సాగిన తన కెరీర్.విజయ్ సేతుపతి నటించిన కె/పి రణ సింగం లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలలో పారితోషకాన్ని పెంచేసిందట.ఇక ఈ విషయం గురించి స్పందిస్తూ.తను నటించిన కె/పి గణ సింగం వంటి పలు సినిమాలు తనను ప్రేక్షకులకు మరింత దగ్గరగా చేశాయని తెలిపింది.ఈ సినిమాల పట్ల తనకు రెమ్యూనరేషన్ పెరిగిందని.
కానీ తన మొదటి లక్ష్యం ఎప్పుడు రెమ్యూనరేషన్ కాదని క్లారిటీ ఇచ్చింది.అర్హురాలని కావున ఎంత ఇస్తున్న ఆ డబ్బు మాత్రం ముఖ్యం కాదని.
మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ముఖ్యమని తెలిపింది.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉంది.
అంతే కాకుండా మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఇక పవన్ కళ్యాణ్ నటించనున్న ఓ సినిమాలో అవకాశం అందుకుందట ఐశ్వర్య.
అంతేకాకుండా టక్ జగదీష్ సినిమాలో కూడా నటిస్తుందట.ఇక ఈ సినిమాలో మేకప్ లేకుండా చిన్న పట్టణానికి చెందిన అమ్మాయిగా కనిపించనుందట.
ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమాలో కూడా నటిస్తుందని తెలుస్తుంది.