వెండితెరపై స్టార్స్ గా గుర్తింపును సంపాదించుకున్న హీరోలు ఈ మధ్య కాలంలో బుల్లితెరపై కూడా దృష్టి పెడుతున్నారు.బుల్లితెరపై షోలు చేయడం వల్ల ప్రేక్షకుల్లో మరింత ఎక్కువగా గుర్తింపును సంపాదించుకోవడం సాధ్యమవుతుంది.
తెలుగులో స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, రానా బుల్లితెర షోలను హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ హీరోలు ఎవరి రేంజ్ కు తగినట్టు వాళ్లు పారితోషికం తీసుకుంటున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు బుల్లితెర షోలకు 10కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే బాలీవుడ్ లో మాత్రం టాలీవుడ్ హీరోలతో పోలిస్తే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకుంటున్నారు.
అమీర్ ఖాన్ హోస్ట్ గా కొన్నేళ్ల క్రితం సత్యమేవ జయతే అనే షో ప్రసారమైన సంగతి తెలిసిందే.ఈ షో కోసం అమీర్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 3కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు.
ప్రముఖ దర్శకుడు రోహన్ శెట్టి హిందీలో ఖత్రోన్ కీ ఖిలాడీ పేరుతో ప్రసారమవుతున్న షోకు ఒక్కో ఎపిసోడ్ కు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటున్నారని తెలుస్తోంది.గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి షోకు అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఈ షో కొరకు అమితాబ్ 3కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు.
అయితే బాలీవుడ్ లో టీవీ షోల ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించిన వ్యక్తి సల్మాన్ ఖాన్ కావడం గమనార్హం.బిగ్ బాస్ సీజన్ 14 కోసం సల్మాన్ ఖాన్ ఎపిసోడ్ కు 16కోట్ల రూపాయల చొప్పున తీసుకున్నారని సమాచారం.కొంతమంది బాలీవుడ్ స్టార్ హీరోలు టీవీ షోల ద్వారా సినిమాలను మించి డబ్బును సంపాదిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్లు అంచనాలకు అందని స్థాయిలో ఉండటం గమనార్హం.