దేశంలో వరుసగా భూప్రకంపనలు రావటం ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం 6 గంటల 42 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు రావడంతో.
జనాలు ఇల్లల్లో నుండి పరుగులు బయటకు తీశారు.ఈ పరిణామంతో ఢిల్లీ ప్రభుత్వం కాసేపు మెట్రో సేవలను నిలిపి వేయడం జరిగింది.
స్వల్పంగా భూమి కంపించడంతో ఒక్కసారిగా ఢిల్లీ వాసులలో అందరిలో ఆందోళన మొదలయ్యింది.ఇదే సమయంలో ఢిల్లీ మెట్రో అరగంటపాటు నిలిపివేయడంతో.
మెట్రో స్టేషన్ బయట జనాలు కిక్కిరిసిపోయారు.
ఇదే తరుణంలో నాగర్కర్నూల్ లో కూడా భూమి కంపించడం జరిగింది.
రిక్టర్ స్కేలుపై నాలుగు కంటే అధికంగా తీవ్రత నమోదు కావడంతో నాగర్ కర్నూల్ వాసులు భయాందోళనలు చెందుతున్నారు.ఇలా వరుసగా దేశంలో రెండు చోట్ల భూమి కంపించడంతో ప్రభుత్వాలు కూడా టెన్షన్ పడుతున్నాయి.
ముఖ్యంగా నాగర్ కర్నూలులో తీవ్రత నాలుగు రెక్టార్ స్కేల్ పై నమోదు కావడంతో సాధారణం కంటే తీవ్రత ఎక్కువగా ఉండే పరిస్థితి కావడంతో.ఆ ప్రాంత వాసులు భయాందోళనలు చెందుతున్నారు.