సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష తన కెరియర్ లో మరో లక్కీ ఛాన్స్ అందుకుంది.కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న త్రిష లేటెస్ట్ గా కన్నడ లో ఒక భారీ సినిమా ఛాన్స్ అందుకుందని టాక్.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, పవన్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ద్విత్వా సినిమాలో త్రిషని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.
సినిమాలో త్రిషని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
పునీత్ రాజ్ కుమార్ తో త్రిష ఆల్రెడీ పవర్ సినిమాలో నటించింది.2014లో వచ్చిన ఆ సినిమా హిట్ అయ్యింది.మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత పునీత్ త్రిష కలిసి నటిస్తున్నారు.
తమిళంలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న త్రిష కన్నడలో మాత్రం కమర్షియల్ మూవీ ఛాన్స్ అందుకుంది.అయితే తెలుగులో వస్తున్న సినిమాలకు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది.
సినిమాలో త్రిష నటించడం కన్నడ స్టార్ మూవీకి సూపర్ క్రేజ్ ఏర్పడింది.ద్విత్వా సినిమా కూడా పునీత్ రాజ్ కుమార్, త్రిషల కాంబో హిట్ మేనియా కొనసాగిస్తుందేమో చూడాలి.
సినిమాను కన్నడతో పాటుగా తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.