ఏపీ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.దేశంలో అందరూ ఒక రకంగా ఆలోచిస్తే ఏపీ సీఎం వై ఎస్ జగన్ మరో విధంగా ఆలోచిస్తారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.
కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో ఎలాగైనా పరీక్షలు పెట్టి తిరుతామని మొండి పట్టుదలతో ప్రభుత్వం వ్యవహరిస్తే సుప్రీంకోర్టు జోక్యంతో రద్దు అయ్యాయని గుర్తు చేశారు.ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది నేపథ్యంలో విద్యార్థులు మరో ప్రమాదాన్ని ఎదుర్కొబోతున్నారని రఘురామకృష్ణరాజు గారు వ్యాఖ్యానించారు.
కరోనా మూడో దశ వచ్చే అవకాశం ఉన్నందున దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మోడీ సూచిస్తున్నారు.ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ రోజు 2 వేల నుంచి 3 వేల కోట్లు కేసు నమోదు అవుతున్నాయి.
గతంతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి.అన్ లైన్ క్లాసులు పరిగణిస్తున్నారు.
మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించక పోతుంది.ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పాఠశాలల ప్రారంభంపై రహస్య బ్యాలెట్ నిర్వహించండి అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వాలంటీర్లు ద్వారా సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించండి.మీరు 40 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
పాఠశాలలు తెలిస్తే రాబోయే ఉపద్రవాన్ని ఊహించండి.ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించి ఏం సాధించాలనుకుంటున్నారు అని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు.