ఇటీవలే బాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో అశ్లీల చిత్రాలను తెరకెక్కిస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త “రాజ్ కుంద్రా” ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి దుమారం రేపుతోంది.దీంతో నిన్న మొన్నటి వరకు ఈ వ్యవహారంపై సినీ సెలబ్రిటీలు పెద్దగా స్పందించకపోయినప్పటికీ తాజాగా కొందరు సెలబ్రిటీలు రాజ్ కుంద్రా పై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాగా ఈ అశ్లీల చిత్రాల వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖ సీరియల్ హీరోయిన్ “శృతి గేరా” స్పందించింది.
ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేశానని తెలిపింది.
ఈ క్రమంలో కొందరు తనని కూడా ఈ అశ్లీల చిత్రాలలో నటించమని సంప్రదించారని కానీ తాను మాత్రం ససేమిరా అందుకు ఒప్పుకోలేదని తెలిపింది.కొందరైతే ఏకంగా తన నగ్న వీడియోల శాంపిల్స్ ను ఆడిషన్స్ కి పంపితే లక్షల రూపాయలతో పాటు పలు సినిమా అవకాశాలను కూడా ఇప్పిస్తామని చెప్పారట.
అయినా కూడా తానెప్పుడు సినిమా అవకాశాలు కోసం అడ్డదారులు తొక్కలేదని తెలిపింది.అయితే ఈ అశ్లీల చిత్రాలలో నటించడానికి సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లని టార్గెట్ చేస్తారని అంతేకాకుండా వారికి మత్తు మందు పదార్థాలను ఇచ్చి అశ్లీల చిత్రాలలో నటింపచేస్తారని కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో ప్రస్తుతం శృతి గేరా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.
అయితే రాజ్ కుంద్రా అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖ హీరో “సచిన్ జోషి” కూడా స్పందించాడు ఇందులో భాగంగా గతంలో రాజ్ కుంద్రా కి సంబంధించిన సంస్థలలో దాచుకున్న బంగారం ని కాజేసేందుకు అధికారులు పన్నాగం పన్నారని దాంతో కోర్టుకెక్కి తన బంగారాన్ని సొంతం చేసుకున్నారని తెలిపాడు.అంతేకాకుండా చేసిన పాపాలకి శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.అయితే ఇటీవలే ఈ విషయంపై బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా స్పందిస్తూ తన భర్త అమాయకుడని ఏ పాపం ఎరుగడని అలాగే కొందరు కావాలనే తన భర్తనే ఈ కేసులో ఇరికించారని వాపోయింది.
దీంతో రాజ్ కుంద్రా అరెస్ట్ ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.