పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.ఆదివారం జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెల్లడైన ఫలితాల్లో 47 స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో గెలుపొందారు.ఏలూరులో కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్ లో ఉండగా ఎన్నికల ముందే మూడు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మార్చి 10న మొత్తం 47 డివిజన్లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం డివిజన్లో సగం కంటే ఎక్కువ వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీ మేయర్ పీఠాన్ని ఏర్పాటు దక్కించుకుంది.వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల తెలుగుదేశం పార్టీ 4 స్థానాల్లో గెలుపొందారు. 2, 4, 5, 6, 8, 10, 11, 13, 17, 18, 20, 21, 22, 23, 24, 25, 26, 31, 33, 35, 36, 38, 39, 40, 41, 42, 43, 45, 46, 48, 49, 50 డివిజన్లలో విజయం సాధించారు. 28, 37, 47 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.ఓట్ల లెక్కింపు పూర్తయింది.
గతంలో ఏకగ్రీవమైన 3 స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే వెళ్లడంతో ఆ పార్టీ 47 డివిజన్ లో గెలుపొందినట్లయింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంతో ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు,, కార్యకర్తలు, శ్రేణులు విజయానందంతో పండగ చేసుకుంటున్నారు.