చాక్లెట్ అనుకుని గణేష్ విగ్రహం మింగేసిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైంది..?

మనం పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.తల్లిదండ్రులు అప్రమత్తంగా పిల్లల్ని కాపాడుకోవాలి.

 Three Year Old Baby Swallowed Ganesh Idol In Bangalore, Ganesh Idol ,bangalore,-TeluguStop.com

వాళ్ళు ఏం తింటున్నారు.? ఎలా ఉంటున్నారని.ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటూ ఉండాలి.పసిమనసులు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఏది ఇచ్చినా.ఏది కనబడినా.తీసుకొని తినేస్తారు.

వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలో హెచ్ ఎం ఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే ఆ పూజా కార్యక్రమం లో ఓ చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది.

చాక్లెట్ అనుకుందో ఏమో ఆ చిన్నారి ఓ చిన్నపాటి గణేష్ విగ్రహం మింగేసింది.తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

వెంటనే తన మూడేళ్ల చిన్నారి సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్యులు ఎక్స్రే తీసి చూడగా పొట్టలో విగ్రహం ఉన్నట్లు గుర్తించారు.ఈ క్రమంలో ఎండోస్కోపీ ద్వారా ఆ మూడేళ్ల చిన్నారి కి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటకు తీశారు వైద్యులు.

వైద్యులు కూడా ఆ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.పిల్లల విషయంలో అజాగ్రత్త పనికి రాదని, వాళ్ల కేరింగ్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube