ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో రూపొందబోతున్న సినిమా షూటింగ్ నిన్న సింపుల్ గా ప్రారంభం అయ్యింది.మొదటి సెడ్యూల్ లో బిగ్ బి అమితాబచ్చన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
అమితాబచ్చన్ పై మొత్తం షూటింగ్ ను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.మళ్లీ ఆయన రెండు మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే సరిపోతుందట.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగుతుందనే విషయం తెల్సిందే.
అందులో భాగంగా ప్రేక్షకులను చిత్ర యూనిట్ సభ్యులు 2050 సంవత్సరానికి తీసుకు వెళ్లబోతున్నారు.ముప్పై ఏళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూపించే ప్రయత్నం చేయబోతున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రొబోలను ప్రముఖంగా వినియోగించబోతున్నారట.కొన్ని రోబోలను సెట్టింగ్ చేయబోతున్నారు.కొన్ని రోబోలను మాత్రం రియల్ గా వినియోగించబోతున్నారు.అందుకోసం జపాన్ నుండి రోబోలను తెప్పిస్తున్నారట.జపాన్ నుండి దాదాపుగా అయిదు కోట్ల ఖర్చుతో రోబోలను తీసుకు రావడంతో పాటు అత్యంత హై టెక్నాలజీ ని ఉపయోగించి అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది.జపాన్ నుండి తెప్పించబోతున్న రోబోల గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా అక్కడ డిజైన్ చేయించి మరీ రోబోలను తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాచారం అందుతోంది.ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కే కోసం ముందు ముందు మరెంతగా అద్బుతాలను దర్శకుడు ఆవిష్కరిస్తాడో చూడాలి.
ఈ సినిమా లో ప్రభాస్ కు జోడీగా ముద్దుగుమ్మ దీపిక పదుకునే నటించబోతుంది.భారీ అంచనాలున్న ఈసినిమా కోసం అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వర్క్ చేయబోతున్నారట.