పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర సమస్య ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రారంభమయ్యాయి.ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కింపు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తి కానుంది.మొదటి 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లు లెక్కింపు జరుగుతుంది.46వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్యారీ బేగం ఘన విజయం సాధించారు.అయితే ప్యారీ బేగం ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు.
ప్యారీ బేగం మృతితో మళ్ళీ డివిజన్ లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.మొత్తం 47 డివిజన్ లో వైసీపీ ముందంజలో ఉంది.
ఎప్పటికీ కూడా డివిజన్లో వైసిపి ఏకగ్రీవంగా గెలిచింది ఇప్పటికే వరకు మొత్తం 22 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తథ్యం అని ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు,, కార్యకర్తలు, శ్రేణులు విజయానందంతో పండగ చేసుకుంటున్నారు.