ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది.వర్షాలు కురవడం వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఎక్కడా కూడా చెరువులు, కుంటలో నిండిపోయాయి.
వానల వల్ల పాములు, పురుగులు ఇల్లల్లోకి వస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతం ఆ జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ పాము వానకు ఉండలేక ఓ ఇంట్లోకి వచ్చి చేరింది.ఇంట్లోకి రావడమే కాదు ఏకంగా అది ఫ్రిజ్ లోకి వచ్చి చేరిపోయింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ త్రాచుపాము ఇంట్లోకి చేరిపోయింది.ఇంట్లోకి రావడమే కాదు అది ఫ్రిజ్ లోకి దూరిపోయింది.
దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆ పామును చూసి పరుగులు తీశారు.
తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంకలో ఈ ఘటన చోటుచేసుకుంది.6 అడుగుల నల్ల త్రాచుపాము ఇంట్లోకి రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు.పితాని నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఆ పాము దూరింది.
ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిజ్ లో ఆ పాము చేరిపోయింది.ఇంట్లో వాళ్లు ఫ్రిజ్లో ఉన్నటువంటి వాటిని తీసుకునేందుకు ఆ ఫ్రిన్ ను ఓపెన్ చేశారు.
దీంతో ఒక్కసారిగా ఆ పాము బుసలు కొడుతూ ఫ్రిజ్ నుంచి బయటకు వచ్చింది.
ఆ పాము ఒక్కసారిగా పడగవిప్పి బుసలు కొట్టడంతో అందరూ భయంతో కంపించిపోయారు.పాము చేసే శబ్దానికి ఒక్కసారిగా ఆ కుటుంబీకులు హడలిపోయారు.ఫ్రిజ్లో దాకున్న ఆ పాము చేసే అరుపులు విని భయంతో వనికిపోయారు.
వెంటనే ఆలస్యం చేయకుండా వారు పాములను పట్టేవారికి సమాచారాన్ని అందించారు.దీంతో పాము ఉన్న స్థలానికి ఆ పాములు పట్టేవారు చేరుకున్నారు.
వెంటనే ఆ పామును పట్టేందుకు ఓ గంటపాటు శ్రమించారు.అలా ఎంతో శ్రమించిన తర్వాత పామును పట్టుకుని ఓ నిర్మానుష్య ప్రాంతానికి ఆ పామును వదిలిపెట్టారు.
దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.