ప్రపంచంలో చాలా మంది ప్రేమికులు తమ ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ని చూపిస్తుంటారు.కాగా మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ 17వ శతాబ్దంలో తన భార్య ముంతాజ్ బేగం పై ఉన్నటువంటి ప్రేమ కి జ్ఞాపకార్థంగా ఆమె చనిపోయిన తర్వాత తాజ్ మహల్ ని పాలరాయితో నిర్మించాడు.
అయితే ఈ తాజ్ మహల్ నిర్మించి వందల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది.అయితే ఈ తాజ్ మహల్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలలో ఒకటిగా కూడా ఉంది.
ఈ విషయాలు చాలా మందికి తెలుసు.కానీ ప్రపంచంలో రెండో తాజ్ మహల్ కూడా ఉందని చాలా మందికి తెలియదు.
ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం…
ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలలో ఒకటి అయినటువంటి “బంగ్లాదేశ్” గురించి తెలియని వారుండరు.బంగ్లాదేశ్ దేశంలో ఎక్కువగా ముస్లింలు నివాసముంటున్నారు.
అయితే ఈ దేశ రాజధాని అయిన డాఖా నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో తాజ్ మహల్ ఉంది.అయితే తాజ్ మహల్ కి 2 తాజ్ మహల్ అని గుర్తింపు వచ్చినప్పటికీ చరిత్రలో మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు.
అయితే అప్పట్లో ఒక రాజు తాజ్ మహల్ ని కాపీ కొట్టి బంగ్లాదేశ్ దేశంలో ఈ రెండో తాజ్ మహల్ నిర్మించాడని పలు కథనాలు వినిపిస్తున్నాయి.అలాగే ఈ తాజ్ మహాల్ నిర్మించడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు సమయం పట్టిందట.
అయితే ఈ దేశం లో పర్యాటక ప్రాంతాలకి పెట్టింది పేరు.ఇందులో ముఖ్యంగా పురాతన దేవాలయాలు, అలాగే పురాతన కట్టడాలు, సుందర వనాలు వంటి వాటి కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వీటిని చూడటానికి వస్తుంటారు.దీంతో ప్రతిఏటా బంగ్లాదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలని ఈ పర్యాటకం ద్వారా అర్జిస్తోంది.కానీ దేశంలో వ్యభిచారం చట్టబద్ధం చేయడంతో ఎక్కువమంది మహిళలు వ్యభిచార కూపంలో మగ్గిపోతున్నారు.
ఇప్పటికీ ఈ దేశంలోని పలు ప్రాంతాలలో మహిళలు ఎలాంటి పనులకు వెళ్లకుండా కేవలం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు.