టాలీవుడ్ సినీ పరిశ్రమలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా ప్రేక్షకులకి తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ప్రభాస్ నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
అంతేకాకుండా బాహుబలి, సాహో వంటి చిత్రాలతో టాలీవుడ్ చిత్ర సినీ పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేశాడు.దీంతో ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు.
దీంతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాగా ప్రభాస్ తెలుగులో “ఈశ్వర్” అనే చిత్రంతో 2002వ సంవత్సరంలో హీరోగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు.
ఈ క్రమంలో వర్షం, మున్న, బుజ్జి గాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, సాహో, బాహుబలి, మిర్చి తదితర చిత్రాలతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.కానీ కానీ ప్రభాస్ మార్కెట్ ని పెంచింది మాత్రం బాహుబలి, సాహో చిత్రాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను పరిశీలించినట్లయితే ప్రభాస్ చిన్నప్పుడు తీసినట్లు తెలుస్తోంది.
అంతేకాక ప్రభాస్ చిన్నప్పుడు తన పెదనాన్న కృష్ణం రాజు మరియు శ్యామలా దేవిలతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు షేర్ చేశారు.దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ తెలుగులో పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు.ఇందులో ఇప్పటికే “రాధే శ్యామ్” చిత్రం షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా విడుదలకు రెడీగా ఉంది.కాగా ఈ రోజున నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం షూటింగ్ పనులు మొదలు కానున్నాయి.
ఈ విషయాన్ని “వైజయంతి బ్యానర్స్” సంస్థ అధికారికంగా ప్రకటించింది.అయితే ప్రభాస్ “ఆది పురుష్” అనే మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని దాదాపుగా 5 భాషలలో విడుదల చేయనున్నట్లు సమాచారం.