1.భారత్ బయోటెక్ బ్రెజిల్ డీల్ రద్దు
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ విషయంలో బ్రెజిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్ తో వ్యాక్సిన్ డోసులు సరఫరా కోసం చేస్తున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.కో వాక్సిన్ సప్లై కోసం జరిగిన 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలతో ఈ డీల్ నుంచి భారత్ బయోటెక్ తప్పుకుంది.ఈ క్రమంలోనే భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ ను సస్పెండ్ చేస్తూ బ్రెజిల్ నిర్ణయం తీసుకుంది.
2.ఆస్ట్రేలియాలో నిరసనలు
లాక్ డౌన్ ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసనకు దిగారు.
3.కాశ్మీర్ పై ఇమ్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.పిఓకే లోని తరార్ ఖాల్ ఎన్నికల ప్రచారంలో ఇమ్రాన్ మాట్లాడుతూ కాశ్మీర్ ప్రజలు స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారా లేదా పాకిస్తాన్ లో కలిసిపోవాలి అనుకుంటున్నారా అనేది అక్కడి ప్రజలు ఇస్తామని, దీనిపై తాను ఎటువంటి బలవంతపు చర్యలకు దిగను అన్నారు.
4.ప్రవాసభారతీయుల పెద్ద మనసు
దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని ఎనిమిది వందల డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్ ఫుడ్డు బ్యాంకు కు వైఎస్ అభిమానులు డొనేట్ చేశారు.నాటా బోర్డ్ డైరెక్టర్ , వై.ఎస్.ఆర్.సి.పి కమిటీ సభ్యులు సంఘం రెడ్డి అంజి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
5.భారత్ కి అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత్ రానున్నారు.ఈ నెల 27 28 తేదీల్లో ఆయన భారత్ లో పర్యటిస్తారు.
6.టోక్యో ఒలంపిక్స్ .భారత్ కు తొలి పతకం
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం దక్కింది.మహిళల 49 కేజీల విభాగంలో వెయిట్ లెఫ్టర్ మీరా బాయి చాను రజతం గెల్చుకున్నారు.
7.సోషల్ మీడియా పై వైట్ హౌస్ ఆగ్రహం
కేక పై తప్పుడు సమాచారం వ్యాప్తిపై ఎంత చెబుతున్నా ఫేస్బుక్ , యూట్యూబ్ లు అసలు పట్టించుకోవడం లేదంటూ వైట్ హౌస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
8.ఇండియాకి ‘ టెస్లా ‘ … ఎలన్ మాస్క్ స్పందన
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత్ లో ఎంట్రీ ఇచ్చే విషయమై ఆ సంస్థ అధినేత ఎలన్ మాస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ లో ఎన్నో చేయాలనుకుంటున్నాం కానీ ఇక్కడ దిగుమతి సుంకాలు ప్రపంచంలోనే అత్యధికమని ఓ ట్వీట్ కు ఎలన్ మాస్క్ సమాధానం ఇచ్చారు.
9.గల్ఫ్ లో భారతీయులకు టీకా కష్టాలు
ఇండియా నుంచి గల్ఫ్ వెళ్లి భారతీయులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.కోహ్లీ టేక తీసుకుంటే ఇబ్బంది లేదనే ధైర్యంతో ఉన్న ప్రవాస భారతీయులకు షాక్ తగిలింది.భారత ప్రభుత్వం కోవీస్ యాప్ ద్వారా జారీ చేసిన కోడి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లను కొన్ని గల్ఫ్ దేశాలకు చెందిన యాప్ లు స్వీకరించడం లేదు.
10. బహ్రెయిన్ లో కరోనా ఆంక్షలు ఎత్తివేత
బహ్రెయిన్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో కరోనా ఆంక్షలు దశలవారీగా ఎత్తివేసేందుకు నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది.