జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభమైన ఒలింపిక్ గేమ్స్ అందరికీ తెలిసిన విషయమే.ఒలింపిక్ పథకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ హాకీ జట్టు ఖాతాలో తొలి విజయం నమోదైంది.పురుషుల విభాగంలో జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై 3-2 తేడాతో భారత్ పురుషుల హాకీ జట్టు విజయం సాధించింది.
ఏం జరుగుతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆకరి సమయంలో భారత్ కీపర్ శ్రీజేష్ తానెంతో కీలక ఆటగాడని మరోసారి నిరూపిస్తూ న్యూజిలాండ్ ఆశలను గండి కొట్టి భారత్ ను తదుపరి పోటీలో నిలిపాడు.
భారత జట్టు ఒలింపిక్స్ లో హాకీ హవా కొనసాగుతుంది.
అప్పట్లో అనుకున్నంత స్థాయిలో భారత హాకీ జట్టు ప్రదర్శన ఇచ్చేదికాదు.తర్వాత వచ్చే పురుషుల హాకీ జట్టు ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించాయి.
ఇదిలా ఉంటే మరోవైపు ఆర్చరీలో దీపికా కుమారి, ప్రవీణ్ యాదవ్ ల మిక్సిడ్ టీమ్ క్వార్టర్ ఫైనల్లో తొలిదశలో చైనాకు చెందిన జట్టుపై విజయం సాధించింది.టోక్యో ఒలింపిక్స్ తొలి స్వర్ణ పతకం చైనా గెలుచుకుంది.
రష్యా, స్విట్జర్లాండ్ దేశాలకు గట్టి పోటీ ఇచ్చి చైనా ఈ పథకం గెలుచుకుంది.