దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా కరోనా వైరస్ కి లక్షల్లో ప్రాణాలు పోయాయి.
పేద ధనిక అనే తేడా లేకుండా కోట్లాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ప్రైవేట్ ప్రభుత్వ అని తేడా లేకుండా చిన్నా చితకా ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
వివరాల్లోకి వెళితే కరోనా సెకండ్ వే తగ్గుముఖం పట్టిన తరుణంలో రైల్వే సర్వీసులు మొదలుపెట్టిన తరుణంలో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి.కరోనా కారణంగా చాలామంది కోలుకున్నాప్పటికీ దేశవ్యాప్తంగా గా ఇప్పటివరకు కు 29 వేల 903 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారట.
ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవి పార్లిమెట్ లో వెల్లడించారు.
మరణించిన రైల్వే ఉద్యోగులకు చెందిన బకాయిలను 2780 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు వివరించారు.
అంతేకాకుండా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రైల్వే ఉద్యోగుల పై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆదుకునే కారుణ్య నియామకాలు చేపట్టే విధానం రైల్వే డిపార్ట్మెంట్ లో ఉందని, ఇందులో భాగంగానే ప్రతి బాధిత కుటుంబాలకు కొలువులు కల్పించామని ఆమె అన్నారు అలాగే కరోనా వ్యాక్సిన్ పంపిణీ రైల్వే శాఖలో కూడా శరవేగంగా కొనసాగుతుందని రైల్వే డిపార్ట్మెంట్ వెల్లడించింది.ఎనిమిదిన్నర లక్షల మంది ఉద్యోగులకు తొలిడోసు అందించగా రెండున్నర లక్షల మందికి పూర్తిగా వ్యాక్సినేషన్ అందుకున్నారని పేర్కొన్నారు.