త్వరలో జెమిని టీవీలో టెలికాస్ట్ కాబోతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరులుతో మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్. ఆల్రెడీ బిగ్ బాస్ హోస్ట్ గా చేసిన అనుభవంతో ఈసారి ఎవరు మీకో కోటీశ్వరులు తో ఎంటర్టైన్ చేయనున్నారు.ఈ షో కోసం ఎన్.టి.ఆర్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.అక్కడ ఉంది తారక్ కాబట్టి అడిగినంత ఇచ్చేయాల్సిందే అదీగాక చాలారోజుల తర్వాత జెమిని టీవీలో వస్తున్న క్రేజీ షోగా ఎవరు మీలో కోటీశ్వరులు వస్తుంది.
అయితే ఎన్.టి.ఆర్ కు బదులుగా ముందు ఈ సీజన్ హోస్ట్ గా కలక్షన్ కింగ్ మోహన్ బాబుని అడిగారట ఎవరు మీలో కోటీశ్వరులు టీం.అయితే ఆయన మాత్రం అందుకు ఒప్పుకోలేదట.భారీ రెమ్యునరేషన్ ఇస్తానన్నా సరే మోహన్ బాబు ఆ ఛాన్స్ తీసుకోలేదు.మోహన్ బాబు వద్దన్నాక ఎన్.టి.ఆర్ లైన్ లోకి వచ్చాడు.ఎలా లేదన్నా మోహన్ బాబు కన్నా ఎన్.టి.ఆర్ చేస్తేనే షోకి మంచి ఇంప్యాక్ట్ ఏర్పడుతుంది.స్టార్ మాలో రెండు సీజన్లు నాగార్జున, ఒక సీజన్ చిరంజీవి హోస్ట్ గా చేసిన ఈ షోని కొద్దిగా పేరు అటు ఇటు మార్చి జెమిని టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు.