మళయాళ భామ అను ఇమ్మాన్యుయల్ తెలుగులో నాచురల్ స్టార్ నాని సరసన మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది.ఆ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో క్రేజ్ తెచ్చుకుంటుందని ఊహించారు.
అల్లు అర్జున్ నా పేరు సూర్య, పవన్ అజ్ఞాతవాసి లాంటి స్టార్ సినిమాల్లో నటించినా అమ్మడి ఫేట్ మారలేదు.ఈమధ్య కెరియర్ లో ఒక్క ఛాన్స్ లేఖ ఖాళీగా ఉన్న అను ఇమ్మాన్యుయెల్ కు తెలుగులో చివరగా రెండు అవకాశాలు వచ్చాయి.
అందులో ఒకటి అల్లు శిరీష్ చేస్తున్న ప్రేమ కాదంటతో పాటుగా అజయ్ భూపతి చేస్తున్న మహా సముద్రం ఉన్నాయి.
ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా అను ఇమ్మాన్యుయల్ మళ్ళీ తెలుగులో సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.
ఒకవేళ రెండు సినిమాలు రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఇక అమ్మడు పెట్టాబేడా సర్ధేయాల్సి ఉంటుంది.అను ఇమాన్యుయెల్ కు ఈ రెండు సినిమాలే చివరి అవకాశాలని చెప్పొచ్చు.
మహా సముద్రం ఓ అదిరిపోయే ప్రేమ కథగా వస్తుంది.క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక అల్లు శిరీష్ ప్రేమ కాదంట సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుంది.ఈ రెండు
.