ట్రిపుల్ ఆర్ తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా శంకర్ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న పేరు వినపడుతుంది.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమాలో రాం చరణ్ ఒక్కడు కాదు ఇద్దరట.
అంటే ఆర్సీ 15 సినిమా రాం చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని చిత్రయూనిట్ నుండి వస్తున్న లీక్ ను బట్టి చెబుతున్నారు.శంకర్ సినిమాల్లో హీరోలు రెండు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తారు.
ఇప్పుడు అదే తరహాలో చరణ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఇక కొందరు ఈ సినిమా ఒకే ఒక్కడు సీక్వల్ అని అంటున్నారు.
ఒక్క రోజు సీఎం గా చరణ్ కనిపిస్తారని అంటున్నారు.మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయితే ఇలాంటి వార్తలు రావడం కామనే.
చరణ్ మాత్రం ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ గా ఉన్నాడని తెలుస్తుంది.ఆర్.
ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ కు ఇది పర్ఫెక్ట్ సినిమా అని తెలుస్తుంది.సినిమాలో చరణ్ అన్ని విధాలుగా మెగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు.తెలుగులోనే కాదు ఈ సినిమాపై తమిళంలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.