కరోనా సోకి చావు బతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం తనకు ఇప్పించాలని భార్య కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.భార్య వినతితో కోర్టు అనుమతి తో ఆసుపత్రి సిబ్బంది వీర్యం సేకరించడం జరిగాయి.
అయితే కొన్ని గంటలకే అతను చనిపోయాడు.కరోనాతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సదరు వ్యక్తి భార్య ఇటీవలే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
చావుబతుకు లో ఉన్న తన భర్త వీర్యం ఇప్పించాలని అతని ద్వారా ఐవిఎఫ్ పద్ధతిలో ఒక బిడ్డకు తల్లి అయ్యే అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరింది.ఈ విషయంలో అత్త మామలు కూడా ఆమెకు అండగా నిలిచారు.
ఆమె పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన గుజరాత్ హైకోర్టు ప్రక్రియ పూర్తి చేయాలని సదరు ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం లో చావుబతుకుల్లో ఉన్నా వ్యక్తి వీర్యం సేకరించారు డాక్టర్లు.
విజయ్ గాని కొన్ని గంటలకే అతడు మరణించాడు.
గుజరాత్ వడోదర కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి గత మూడు నెలల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 29 ఏళ్ల భార్య ఉంది.ఈ దంపతులకు పిల్లలు లేరు జూలై 20న భర్త పరిస్థితి విషమించింది 24 గంటలకి మించి బతికే అవకాశం లేదని డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు.
ఒకవైపు భర్తను కోల్పోతున్న అనే బాధ మరోవైపు అతని ప్రతిరూపమైన చూసుకోవాలని ఆ భార్యను కోర్టు మెట్లు ఎక్కిలా చేసింది.జూలై 20 నా గుజరాత్ హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసింది.
ఆమె పిటిషన్ సానుకూలంగా స్పందించిన కోర్టు అందుకు తగిన ఆదేశాలు జారీ చేసింది.