నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.
షూటింగ్ ను వచ్చే నెల లో పూర్తి చేస్తారనే వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ ను తమిళనాడులో నిర్వహిస్తున్నారు.
మొన్నటి వరకు ఇక్కడే ఉన్న బాలయ్య నిన్న చెన్నై విమానం ఎక్కేశాడు.అక్కడ షూటింగ్ ను ముగించుకుని పది రోజుల్లో ఆయన హైదరాబాద్ కు తిరిగి వస్తాడట.
అఖండ సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశంను అక్కడ ప్లాన్ చేశారట.పాటల చిత్రీకరణ కూడా దాదాపుగా ముగిసిందని.
తమిళనాడులో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న తర్వాత దర్శకుడు హైదరాబాద్ లో తుది షెడ్యూల్ ను ప్లాన్ చేశాడు.ఆ సందర్బంగా కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట.
తద్వార సినిమా పూర్తి అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న అఖండ సినిమా కు గతంలో ఎప్పుడు లేనంతగా బజ్ ఉంది.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దర్శకుడు ఈ సినిమాతో రాబడుతాడు అనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.బాలయ్యకు ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందనే నమ్మకంను కూడా ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
అఖండ సినిమాలో కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని యూనిట్ సభ్యులు అంటున్నారు.అఖండ ముగించిన వెంటనే బాలయ్య కొత్త సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభం అవ్వబోతుంది.ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందట.