ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు.గతంలో మాదిరిగా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా మెరుపుదాడులు చేస్తూ.
తాజాగా రాజధాని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో దేవి చేస్తున్న పౌరుల ఇళ్ళ పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.తాలిబాన్లు చేసిన ఈ మెరుపుదాడిలో 100 మంది సామాన్యులు మరణించారు.
ఈ జిల్లాలలో మోటారు బైకులపై ఉగ్రవాదులు ప్రయాణిస్తూ దాడులకు పాల్పడినట్లు వీడియో ఫుటేజీల్లో బయటపడింది.ఇదే విషయాన్ని ఆఫ్గనిస్తాన్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు.
అంతేకాకుండా ఆ జిల్లాలలో ప్రభుత్వ ప్రతినిధి అధికారిని కూడా చంపి అతని ఇంటిపై తాలిబాన్లు ఉగ్రవాదుల జెండా ఎగరవేయడం జరిగింది.దాదాపు వందమంది చనిపోవడంతో ఎక్కడికక్కడ మృతదేహాలు ఆ ప్రాంతాల్లో పడి ఉన్నట్లు ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో నాటో దళాలు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు.చాలావరకు ప్రభుత్వాన్ని పడగొట్టే రీతిలో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ లో చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు