మహానటి సావిత్రి గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గుంటూరు జిల్లాకు చెందిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు.
చిన్నప్పటి నుంచి కళలపై ఆసక్తి ఉన్న సావిత్రి నాటకాల్లోకి ప్రవేశించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.తమిళంలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో చివరి దశలో సావిత్రి ఇబ్బందులు పడ్డారు.
మహానటి సావిత్రి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు.
కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సావిత్రి ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు న్యాయం చేశారు.సావిత్రికి ఇద్దరు పిల్లలు కాగా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, సావిత్రి కొడుకు సతీష్ సినిమాలపై ఆసక్తి చూపించలేదు.
అయితే సావిత్రి కూతురు చాముండేశ్వరి చిన్న కొడుకు అభినయ్ మాత్రం యంగ్ ఇండియా అనే సినిమాతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.
సావిత్రి పేరు చెప్పకుండానే కష్టపడి దాసరి సినిమాలో అవకాశం సంపాదించిన అభినయ్ అమ్మమ్మ పేరుతో గుర్తింపును సంపాదించుకోవాలని తాను ఏ సందర్భంలో కూడా అనుకోలేదని వెల్లడించారు.రజనీకాంత్, కమల్ హాసన్ ఆశీస్సులతో ఎంట్రీ ఇచ్చిన అభినయ్ హాలీవుడ్ లో శ్రీనివాస రామానుజన్ బయోపిక్ లో కూడా నటించారు.రామనుజన్ తన నటనతో మన దేశ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
అభినయ్ కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు.టాలీవుడ్ లో చరణ్, బన్నీ, మనోజ్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని అభినయ్ చెప్పుకొచ్చారు.అయితే సావిత్రి మనవడు అభినయ్ కెరీర్ లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం గమనార్హం.