అప్పుడప్పుడూ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు విమర్శలకు తావిస్తుంటాయి.తాజాగా ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా నోరు జారాడు.
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపిఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేశ్ రైనా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రైనాను తెగ తిడుతున్నారు.
సాధారణంగా నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మాట్లాడుతూ అభిమానులతో టచ్ లో ఉండే రైనా ఈసారి మాత్రం వారి కోపానికి కారణమయ్యాడు.తమిళ సంస్కృతిపై రైనా చేసిన వ్యాఖ్యలే నెటిజన్ల కోపానికి కారణం అవుతున్నాయి.
ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ కు రైనా కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే బుధవారం కూడా జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ ఇస్తుండగా ఐపిఎల్ ప్రారంభం నుంచి సిఎస్కే తోనే ఉన్న రైనాను తన సహచర కామెంటేటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగాడు.
దీనిపై రైనా స్పందించాడు.
తాను కూడా బ్రాహ్మిణ్ నే అని 2004 నుంచి చెన్నై జట్టుకు ఆడుతున్నానని తెలిపాడు.
అనిరుద్ధ శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడినట్లు తెలిపాడు.సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని ఇక తన జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం అని అన్నారు.
సిఎస్కే జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని, అది ఎంతలా అంటే అక్కడ తనకు చాలా స్వేచ్ఛ దొరుకుతుందని తెలిపాడు.
సిఎస్కే జట్టులో భాగం కావడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని లేపాయి.చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్ లే ఉంటారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలని, ఇన్నేళ్లుగా చెన్నైకి ఆడుతున్నావు, నిజమైన చెన్నై సంస్కృతిని చూసినట్లు లేవంటూ మరో వ్యక్తి ఫైర్ అయ్యాడు.ప్రస్తుతం రైనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో పలువురు రైనా ను విమర్శిస్తున్నారు.