కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా రీమేక్ చేశారు.ఈ సినిమాను సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను నిర్మించారు.
సినిమాలో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలుగా నటించారు.అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.
ముఖ్యంగా అందరు వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
నారప్ప సినిమాకు డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో 40 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.
అంటే ఈ లెక్కన సినిమాకు 17 కోట్ల దాకా లాభం వచ్చినట్టు తెలుస్తుంది.సినిమా థియేట్రికల్ రిలీజ్ చేస్తే ఎలా ఉండేదో కాని నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ చేసి బాగానే లాభ పడ్డారు నిర్మాతలు.
ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ అడ్డాల మాస్ డైరక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు.ఇన్నాళ్లు క్లాస్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల ఇక మీదట ఎలాంటి సినిమా అయినా చేయగలడు అని ప్రూవ్ చేశాడు.
ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో, సురేష్ ప్రొడఖన్ లో చెరో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు శ్రీకాంత్ అడ్డాల.బ్రహ్మోత్సవం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్పతో మళ్లీ ట్రాక్ ఎక్కినట్టే అని చెప్పొచ్చు.