పవన్ కళ్యాణ్ కు జోడీగా అత్తారింటికి దారేది సినిమాలో, ఎన్టీఆర్ కు జోడీగా రభస సినిమాలో నటించి బాపు బొమ్మ ప్రణీత మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.28 సంవత్సరాల వయస్సులో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రణీత పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చారు.పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు ఐతే తగ్గడం లేదు.ప్రముఖ బిజినెస్ మేన్ నితిన్ రాజును పెళ్లి చేసుకున్న ప్రణీత మ్యారీడ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
అయితే మ్యారేజ్ తర్వాత తన లైఫ్ లో పెద్దగా ఏం మార్పులు రాలేదని ప్రణీత చెప్పుకొచ్చారు.మ్యారేజ్ కు ముందు తన లైఫ్ సింపుల్ గా ఉండేదని మ్యారేజ్ తర్వాత కూడా తన జీవితం అదే విధంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
సాధారణంగా పెళ్లి చేసుకున్న మహిళలు పెళ్లి తర్వాత ఇతర పనులతో బిజీ అవుతుంటారు.కానీ ప్రణీత మాత్రం తన జీవితం ఏమీ మారలేదని కామెంట్లు చేయడం గమనార్హం.
పెళ్లి తర్వాత కూడా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నానని ఆమె అన్నారు.అందువల్ల తనకు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా తనకు అనిపించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు.తన మాటలకు విలువ ఇచ్చే భర్త ప్రణీతకు దొరికి ఉంటారని అందువల్లే పెళ్లి తర్వాత కూడా ఆమె జీవితంలో మార్పు వచ్చి ఉండదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం ప్రణీత హిందీ సినిమాలతో బిజీగా ఉండగా తెలుగులో అవకాశాలు ఇస్తే ఆమె ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.పెళ్లి తర్వాత అమ్మాయి లైఫ్ స్టైల్ లో, ఇతర విషయాల్లో మార్పులు వచ్చినా ప్రణీత జీవితంలో మాత్రం ఏ మార్పు రాలేదని ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.